పశ్చిమగోదావరిలో కరోనా పాజిటివ్ కేసు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-23 05:26:16  IST  )

<p>పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం అలీ కుమారుడు ఆవాజ్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ఆవాజ్ లండన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆయన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆవాజ్ క్వారంటైన్‌ల ఉండాల్సి ఉంది. కానీ, నిబంధనలను ఉల్లంఘించి రాఘవాపురం గ్రామంలో సయ్యద్ షౌకత్ అలీ అనే వ్యక్తి గృహ ప్రవేశానికి ఈ నెల [&hellip;]</p>

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం అలీ కుమారుడు ఆవాజ్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ఆవాజ్ లండన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆయన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆవాజ్ క్వారంటైన్‌ల ఉండాల్సి ఉంది. కానీ, నిబంధనలను ఉల్లంఘించి రాఘవాపురం గ్రామంలో సయ్యద్ షౌకత్ అలీ అనే వ్యక్తి గృహ ప్రవేశానికి ఈ నెల 18న హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అలీ కుటుంబ మొత్తం హాజరైంది. ఆవాజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏలూరు వైద్యశాఖ అప్రమత్తమైంది.

Tags : corona virus, west godavari, corona positive case, return to london

Next Story