కరీంనగర్‌కు బ్రిటన్ టెన్షన్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-12-24 01:29:20  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్‌లో కరీంనగర్ వాసులనే కలవర పెట్టిన కరోనా సెకండ్ వేవ్ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా బ్రిటన్ టెన్షన్ కూడా కరీంనగర్ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిటన్ నుంచి గత కొన్ని రోజులుగా కరీంనగర్ వచ్చిన 16 మందిని జిల్లా అధికారులు గుర్తించారు. ఇప్పటికే 10 మంది శాంపిల్స్ వైద్యాధికారులు తీసుకోగా మరో ఆరుగురి అడ్రెస్ ట్రేస్ చేస్తున్నారు. దీంతో [&hellip;]</p>

కరీంనగర్‌కు బ్రిటన్ టెన్షన్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్‌లో కరీంనగర్ వాసులనే కలవర పెట్టిన కరోనా సెకండ్ వేవ్ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా బ్రిటన్ టెన్షన్ కూడా కరీంనగర్ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిటన్ నుంచి గత కొన్ని రోజులుగా కరీంనగర్ వచ్చిన 16 మందిని జిల్లా అధికారులు గుర్తించారు. ఇప్పటికే 10 మంది శాంపిల్స్ వైద్యాధికారులు తీసుకోగా మరో ఆరుగురి అడ్రెస్ ట్రేస్ చేస్తున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో నాడు ఇండోనేషియన్ల రూపంలో కరోనా సోకితే ఇప్పుడు బ్రిటన్ రిటర్న్ వాసుల రూపంలో వస్తుందా అన్న కలవరం జిల్లా వాసుల్లో మొదలైంది.

Next Story