తెలంగాణలో కొత్తగా 322 మందికి కరోనా వైరస్

by  |
corona active cases in telangana district wise
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా మరో 322 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,58,376కు చేరుకున్నాయి. డిశ్చార్జ్‌ల సంఖ్య 6,48,648కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76 తేలగా, ఆదిలాబాద్ లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 9, జగిత్యాలలో 13, జనగామ 4, భూపాలపల్లి 2, కామారెడ్డి 2, కరీంనగర్‌ 27, ఖమ్మం 13, మహబూబ్ నగర్‌ 3, మహబూబాబాద్‌ 11, మంచిర్యాల 5, మేడ్చల్ మల్కాజ్ గిరి 20 , ములుగు 2, నాగర్ కర్నూల్‌ 4, నల్లగొండ 17, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 15, రాజన్న సిరిసిల్ల 7, రంగారెడ్డి 22, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 7, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 25, యాదాద్రి భువనగిరిలో మరో 6 కేసులు చొప్పున తేలాయి. దీంతో ప్రస్తుతం ఆక్టీవ్ కేసుల సంఖ్య 5,852కు చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed