వాట్సప్ వాడుతున్నారా.. ఇలా చేయకండి

by  |
వాట్సప్ వాడుతున్నారా.. ఇలా చేయకండి
X

దిశ, మెదక్: కరోనా సోకిన వ్యక్తి ఫొటో, అడ్రస్, వ్యక్తిగత వివరాలు ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా బాధితుడి పేరు, వివరాలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. గ్రూపు అడ్మిన్‌లు తమ గ్రూపులోని సభ్యులు ఇటువంటి సమాచారం షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీసు శాఖ సోషల్ మీడియా వార్తలపై నిఘా పెటిందని, జిల్లా ప్రజలు ఎవరు కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తుల సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయొద్దని హెచ్చరించారు.

Next Story

Most Viewed