వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..

by  |
వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల తీవ్రత నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కరోనా వాక్సిన్ తీసుకున్నారు.

నిమ్స్ హాస్పిటల్‌లో కొవిడ్-19 మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని, టీకా తీసుకోవడంలో ఎలాంటి అపోహలకు పోవద్దని ప్రజలకు సూచించారు.


Next Story

Most Viewed