దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

by  |
carona 1
X

దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 50,040 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇక నిన్న కరోనాతో 1,258 మృతి చెందారు. అదే సమయంలో కరోనా నుంచి 57,944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 2,92,51,029 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,95,751 కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతంలో 5,86,403 కేసులుఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Next Story