ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగికి కరోనా

by  |
ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగికి కరోనా
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగితోపాటు మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి దీప్తి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగి మర్రిగూడలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి వెల్లడించారు. దీంతో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆదేశాలతో మండల పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న కార్యాలయ ఉద్యోగులు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించి హోమ్ క్వారంటైన్ ఉండవలసిందిగా స్థానిక ఎంపీడీఓ ఆదేశించారు.


Next Story

Most Viewed