టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా.. కార్యకర్తల్లో టెన్షన్

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా.. కార్యకర్తల్లో టెన్షన్
X

దిశ, తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో గురువారం పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయినట్లు తేలింది. తన స్నేహితుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.

పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని, ఎవరు ఆందోళన కూడా పడొద్దని కోరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్నందున అందరూ మస్కులు ధరించి, కోవిడ్ నిబంధలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పైలట్ రెడ్డికి రెండోసారి కరోనా సోకడం గమనార్హం. మొదటి వేవ్‌లో సైతం కరోనా సోకింది.+


Next Story