ఇప్పటికే ఇద్దరు మృతి.. మళ్లీ 8 మందికి కరోనా

by  |
ఇప్పటికే ఇద్దరు మృతి.. మళ్లీ 8 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విజయవాడలోని దుర్గా గుడిలో 8 మందికి కరోనా సోకింది. దీంతో దుర్గా గుడి సిబ్బంది, పండితులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా గుడి మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కాగా, ఇప్పటికే కరోనా సోకి దుర్గా గుడికి చెందిన ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.

Next Story