ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్

by  |
ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి ఎస్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆ కుటుంబాన్ని వైద్యాధికారుల బృందం పరిశీలించి మాట్లాడారు. కరోనా వైరస్ ప్రాణాంతకమైనది కాదని పాజిటివ్ వచ్చిందని, కుటుంబ సభ్యులెవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. పౌష్టిక ఆహారం తీసుకుంటూ, వైద్యుల సూచనలు తప్పక పాటించాలన్నారు. కుటుంబ సభ్యుల్లో ఏమైనా ఆనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు.

Next Story

Most Viewed