నిజామాబాద్‌లో స్ట్రెయిన్ కలకలం..?

by  |
Corona virus
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : లండన్ నుంచి వచ్చిన నిజామాబాద్ వాసికి కరోనా సోకింది. జక్రాన్‌పల్లి మండలంలో ఒక గ్రామవాసికి వైద్యాధికారులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే యూకే స్ట్రెయిన్‌ అని అనుమానంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్‌కు బాధితుడిని తరలించారు. అతడి కుటుంబసభ్యులు 18 మందిని మొదటి కాంటాక్ట్‌గా, వారిని కలిసిన మరో 19 మందిని రెండో కాంటాక్ట్‌గా గుర్తించి వారి నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపామని వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కొత్త కేసుల వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.



Next Story

Most Viewed