దేశవ్యాప్తంగా నేడు మరో 10 కేసులు

by  |

భారత్‌లో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు అందుతున్న సమాచారం మేరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ ప్రకటన చేసింది. బుధవారం నాటికి 158గా ఉన్న బాధితుల సంఖ్య.. గురువారం మరో 10 పాజిటివ్ కేసుల నమోదు కావడంతో ఈ సంఖ్య 168కి చేరింది. తాజాగా హర్యానాలో ఒకటి, మహారాష్ట్ర, కర్నాటకలో 2 చొప్పున కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా, కరోనాను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నేడు ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Tags: carona, positive case, today 10 positive case, india

Next Story

Most Viewed