మరో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా

by  |
మరో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు మదన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. తనకు ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకొని హోంక్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు.


Next Story

Most Viewed