KCR సభకు వెళ్లిన కానిస్టేబుల్స్‌కు కరోనా.. టెన్షన్‌లో పోలీసులు

by  |
KCR సభకు వెళ్లిన కానిస్టేబుల్స్‌కు కరోనా.. టెన్షన్‌లో పోలీసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇటీవల హుజురాబాద్‌లో జరిగిన సీఎం సభకు బందోబస్తులో వీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

జ్వరంతో బాధపడుతున్న వీరికి టెస్ట్‌లు చేయించగా పాజిటివ్ అని తేలడంతో వారిని ఐసోలేషన్‌కు పంపించారు. ముందు జాగ్రత్త చర్యగా స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా మిగతా వారికి నెగిటివ్ అని తేలింది. కరోనా కట్టడి కోసం స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులు ఖచ్చితంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.



Next Story

Most Viewed