టెన్షన్ టెన్షన్.. ఏడుగురు క్రికెటర్లకు కరోనా

by  |
England cricketers
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. జట్టులోని ఏడుగురు సభ్యులకు కరోనా సోకింది. ఈనెల 8న పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ జరగాల్సిన నేపథ్యంలో జట్టు సభ్యులకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో ఏడుగురుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారినపడిన వారిలో ముగ్గురు క్రికెటర్లు ఉండగా..నలుగురు మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఈసీబీ తెలిపింది. గురువారం నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో కొత్త జట్టును ప్రకటించింది. ఇకపోతే పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత ఆగష్టు 4 నుంచి భారత్- ఇంగ్లాండ్‌ల మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది.

Next Story

Most Viewed