మావోయిస్టు నేతకు కరోనా.. ఆన్‌లైన్‌లో చూసి అడవిలో వైద్యం

by  |
మావోయిస్టు నేతకు కరోనా.. ఆన్‌లైన్‌లో చూసి అడవిలో వైద్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కాస్త తగ్గుముఖం పట్టి కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గింది. కానీ అడివిలో మావోయిస్టుల పాలిట కరోనా శాపంగా మారింది. ఇప్పటి వరకూ చాలా మంది మావోయిస్టులు కరోనా కాటుకు బలయ్యారు. అయితే తాజాగా మావోయిస్టు నేత హిడ్మాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హిడ్మా ప్రస్తుతం అడవిలోనే ఆన్‌లైన్‌లో చూసి కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. మూడు వారల్లోనే మధుకర్, కత్తిమోహన్, హరిభూషణ్, సారక్క మృతి చెందారు. వీరు మరణించారనే బాధ నుంచి మావోయిస్టులు బయటపడక ముందే హిడ్మాకు కరోనా పాజిటివ్ రావడం మావోయిస్టు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే మావోయిస్టుల సొంత వైద్యం వలనే పరిస్థితి విషమిస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హిడ్మా ఆరోగ్యంపై మావోయిస్టు పార్టీ స్పందించక పోవడం గమనార్హం.

హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం?

Next Story

Most Viewed