వ్యాక్సిన్ తీసుకున్నాక.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌కు కరోనా

by  |
వ్యాక్సిన్ తీసుకున్నాక.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌కు కరోనా
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్​కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్​మోతే శ్రీలత రెడ్డికి కరోనా పాజిటివ్‌గా​నిర్థారణ అయింది. దీంతో ఈరోజు నుంచి ఆమె.. తన నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్ట్​చేయించుకొని, జాగ్రతలు పాటించాలని ఆమె కోరారు. మోతే శ్రీలత ఈ నెల 20న లాలాపేట అర్బన్​ప్రైమరీ హెల్త్​సెంటర్‌లో కొవిడ్​ సెకండ్​వ్యాక్సిన్​వేసుకున్నారు. అయినా కరోనా పాజిటివ్​నిర్థారణ అయిన నేపథ్యంలో వైరస్​పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె.. ప్రజలను కోరారు.



Next Story

Most Viewed