చౌటుప్పల్‌లో నలుగురికి కరోనా పాజిటివ్

by  |
చౌటుప్పల్‌లో నలుగురికి కరోనా పాజిటివ్
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్రెడ్డి రాజు వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన 60 మంది స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసుకోగా సోమవారం నలుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చౌటుప్పల్‌లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.



Next Story

Most Viewed