బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్

by  |
బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడి చేసినా తగ్గుముఖం పట్టకుండా విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు కరోనా బారినపడటంతో సామాన్య ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మరో బీజేపీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు.

బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుసేన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కలిసినందునే తనకు కరోనా సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని షానవాజ్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed