తొమ్మిది నెలల బాలుడికి కరోనా పాజిటివ్

by  |
తొమ్మిది నెలల బాలుడికి కరోనా పాజిటివ్
X

దిశ, ఆదిలాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం గ్రామానికి చెందిన తొమ్మిది నెలల బాబుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. గతంలో బాలుడి తల్లిదండ్రులకు కరోనా వచ్చినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసుతో కలిపి మొత్తం జిల్లాలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Next Story

Most Viewed