సెంట్రల్ జైల్లో కరోనా విశ్వరూపం..

by  |
సెంట్రల్ జైల్లో కరోనా విశ్వరూపం..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం మరో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. జైల్లో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 294 కు చేరింది. దీంతో కరోనా బాధిత ఖైదీలను జైల్లోనే ఐసోలేషన్‌ సెంటర్ ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. అంతేగాకుండా బాధితులతో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అని జైలు అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed