13 మంది స్టూడెంట్స్‌కు కరోనా

by  |
Corona positive
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా రుద్రవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. 13 మంది పదో తరగతి విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారంపాటు స్కూలుకు సెలవులు ప్రకటించారు. మరోవైపు రుద్రవరం కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకూ పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌కు తరలించారు. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది స్కూలు పరిసరాలతో పాటు గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లి కాలనీలను శానిటైజ్ చేశారు.

Next Story

Most Viewed