షర్మిల టీంకు కరోనా దెబ్బ

by  |
షర్మిల టీంకు కరోనా దెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల టీంను కరోనా భయపెడుతోంది. ఇటీవల షర్మిల మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యోగ దీక్షలో పాల్గొన్న పలువురు అనుచరులకు కరోనా సోకింది. షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. మిగతా టీం సభ్యులు కూడా టెస్టులు చేయించుకున్నారు.

దీంతో మరొక ఇద్దరు అనుచరులు, 8 మంది సెక్యురిటి సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈరోజు ఉదయమే మరికొంతమంది షర్మిల టీం సభ్యులు టెస్టులు చేయించుకోగా.. రిజల్ట్ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed