కడప ఎంపీకి కరోనా పాజిటివ్

by  |
కడప ఎంపీకి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. గత వారంరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఎంపీ అవినాశ్ తెలిపారు.

Next Story