ఏపీలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు

by Vemula.Srinu Prasad |

<p>అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం 6గంటల వరకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగిందని వెల్లడించింది. అలాగే, కొవిడ్ వల్ల మృతి చెందినవారి సంఖ్య ఏడుకు చేరిందని పేర్కొంది. ఇదిలా ఉండగా, కరోనా బారిన పడిన 420మందిలో 12మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు స్పష్టం చేసింది. తాజాగా నమోదైన 15 కేసుల్లో గుంటూరులో [&hellip;]</p>

ఏపీలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు
X

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం 6గంటల వరకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగిందని వెల్లడించింది. అలాగే, కొవిడ్ వల్ల మృతి చెందినవారి సంఖ్య ఏడుకు చేరిందని పేర్కొంది. ఇదిలా ఉండగా, కరోనా బారిన పడిన 420మందిలో 12మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు స్పష్టం చేసింది. తాజాగా నమోదైన 15 కేసుల్లో గుంటూరులో 7, నెల్లూరులో 4, కర్నూల్లో 2, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని వివరించింది.

tags: corona cases in ap, media bulletin, coronavirus, corona death, positive cases, ap govt

Next Story