- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 56,425మందికి పరీక్షలు నిర్వహించగా 402 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,79,339కి చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,082గా ఉంది. ప్రస్తుతం 3,978 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,68,279మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 412మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,57,530 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 86, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 32, కడపలో 25, కృష్ణాలో 72, కర్నూలులో 5, నెల్లూరులో 16, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 35, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 34 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.