ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 70,881మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 7,83,132కు చేరింది. 23మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,429గా ఉంది. ప్రస్తుతం 37,102 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,35,638 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 4,591 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70లక్షల 66వేల 203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి బారిన పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు, ప్రకాశంజిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరులో 458, తూర్పుగోదావరి జిల్లాలో 481, గుంటూరులో 496, కడపలో 206, కృష్ణా జిల్లాలో 503, కర్నూలులో 55, నెల్లూరులో 196, ప్రకాశంలో 334, శ్రీకాకుళంలో 168, విశాఖపట్నంలో 218, విజయనగరంలో 82, పశ్చిమగోదావరి జిల్లాలో 528 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed