తెలంగాణలో 14 వేలు దాటిన కరోనా కేసులు

by  |
తెలంగాణలో 14 వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకీ క్రమేనా వ్యాప్తి చెందుతుంది. ఆదివారం ఒక్క రోజే 983 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ రోజు వైరస్ కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు వైరస్ కారణంగా మొత్తం 247 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 14, 419 కేసులు నమోదు కాగా.. 5172 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్నటికి ఈ రోజుకి ఏకంగా 104 కేసులు తగ్గడం విశేషం.

Next Story