ఓయూ లేడీస్ హస్టల్‌లో కరోనా కలకలం..

by  |
ఓయూ లేడీస్ హస్టల్‌లో కరోనా కలకలం..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఓయూ లేడీస్ హస్టల్‌లో ఇద్దరు పీజీ విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. వారిద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోఠి ఆసుపత్రికి తరలించారు. దీంతో లేడీస్ హస్టల్ రూంలను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు.

కాగా, ఓయూ లేడీస్ హాస్టల్లో 400 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇద్దరికి పాజిటివ్ రావడంతో మిగతా వారిలో టెన్షన్ ప్రారంభమైంది.

Next Story