కరోనా ఎఫెక్ట్: ఒకేరోజు 167 మంది మృతి

by  |
కరోనా ఎఫెక్ట్: ఒకేరోజు 167 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ్యాప్తంగా 12,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 167 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ఇక 18,385 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో… మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు చేరింది. అంతేగాకుండా ఇప్పటి వరకు 1,01,11,294 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఇక, 1,51,327 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,16,558 యాక్టివ్ కేసులు ఉన్నట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ తెలిపింది.


Next Story