ఏపీలో 8లక్షల 30వేలు దాటిన కరోనా కేసులు

by  |
ఏపీలో 8లక్షల 30వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ తగ్గిపోయింది. గడిచిన 24గంటల వ్యవధిలో 84,534మందికి పరీక్షలు నిర్వహించగా 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,30,731కి చేరింది. 15మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 6,734గా ఉంది. ప్రస్తుతం 21,672 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8.02లక్షల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 3,700మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 82.66లక్షల మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 142 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 436, తూర్పుగోదావరిలో 394, గుంటూరులో 277, కడపలో 169, కృష్ణాలో 421, కర్నూలులో 35, నెల్లూరులో 93, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 88, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 78, పశ్చిమగోదావరిలో 386 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story