ఏపీలో 4.65లక్షలు దాటిన కేసులు

by  |
coronavirus
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు, వరుసగా ఎనిమిదో రోజు 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 62,225 మందికి పరీక్షలు నిర్వహించగా 10,199 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 65వేల 730కి చేరింది. తాజాగా 75మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4200గా ఉంది. ఇవాళ 9,499 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,701 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 3,57,829 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 39లక్షల 5వేల 775మందికి శాంపిల్స్ పరీక్షించారు.

కరోనా మహమ్మారి బారినపడి తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో 9మంది, గుంటూరులో 9మంది, అనంతపురంలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో 6, కడపలో 5, కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా 1,090 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నెల్లూరు 982, ప్రకాశం 926, కడపలో 898, చిత్తూరులో 885, అనంతపురంలో 854, పశ్చిమగోదావరి జిల్లాలో 836, చిత్తూరులో 885, అనంతపురంలో 854, పశ్చిమగోదావరి జిల్లాలో 836, గుంటూరులో 805, శ్రీకాకుళంలో 717, విశాఖలో 695, కర్నూలులో 616, విజయనగరంలో 577, కృష్ణా జిల్లాలో 318 కరోనా కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్ల్ బులెటిన్ వెల్లడించింది.



Next Story

Most Viewed