ఏపీలో 2లక్షల 81వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 2లక్షల 81వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 53,712 నమూనాలను పరీక్షించగా 8,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షల 81వేల 817కు చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి 87మంది చనిపోవడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,562కు చేరింది. ఇవాళ 10,414 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 88,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు చికిత్స తీసుకొని లక్షా 91వేల, 117మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28లక్షల 12వేల 197మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

చిత్తూరు జిల్లాలో 10మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, గుంటూరులో 9మంది, తూర్పుగోదావరిలో 8మంది, పశ్చిమగోదావరిలో 8మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 851 కేసులు రాగా, చిత్తూరులో 959, తూర్పుగోదావరి 1,126, చిత్తూరు 959, గుంటూరు 609, కడప 389, కృష్ణా 298, కర్నూలు 734, నెల్లూరు 572, ప్రకాశం 489, శ్రీకాకుళం 638, విశాఖపట్నం 894, విజయనగరం 561, పశ్చిమగోదావరిలో 612 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story