ఏపీలో 2లక్షల 73వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 2లక్షల 73వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 53,026 మంది నమూనాలు పరీక్షించగా 8,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 73వేల 085కి చేరింది. ప్రస్తుతం 89,907 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స తీసుకొని లక్షా 80వేల 703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 9,779 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 97మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరింది.

కరోనా బారిన పడి కర్నూలు జిల్లాలో 12 మంది చనిపోగా తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది, విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం, కడప జిల్లాలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది…

గడిచిన 24గంటల్లో అనంతపురంలో 762 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరు 978, తూర్పుగోదావరి 1146, గుంటూరు 527, కడప 530, కృష్ణా 338 కర్నూలు 956, నెల్లూరు 669, ప్రకాశం 300, శ్రీకాకుళం 547, విశాఖపట్నం 885, విజయనగరం 548, పశ్చిమగోదావరి జిల్లాలో 748 కేసులు నమోదయ్యాయి.

Next Story