భారత్‎లో తగ్గుముఖం పట్టిన కరోనా

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్ : భారత్‎లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,791 కరోనా బారిన పడగా.. 587 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 75,97,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,15,197 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,48,538 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 67,33,329 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, సోమవారం 10,32,795 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య [&hellip;]</p>

భారత్‎లో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్ : భారత్‎లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,791 కరోనా బారిన పడగా.. 587 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 75,97,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,15,197 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,48,538 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 67,33,329 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, సోమవారం 10,32,795 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది.

అయితే గత మూడు నెలల నుంచి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్‎ను దాటింది. మూడు నెలల తర్వాత తొలిసారి 50 వేల లోపు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Next Story