దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే!

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,62,727 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,37,03,665 కి చేరింది. ఇందులో 1,97,34,823 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,10,525 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,120 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,58,317కి పెరిగింది. ఇక 24 గంటల్లో 3,52,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Next Story

Most Viewed