భూపాలపల్లి‌లో మరో కరోనా కేసు

by  |
భూపాలపల్లి‌లో మరో కరోనా కేసు
X

దిశ, భూపాలపల్లి: లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.ఇన్నిరోజులు గ్రేటర్ కే పరిమితమైన కేసులు ఈ మధ్యకాలంలో జిల్లాలకు వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుని కుమారుడికి సోమవారం కరోనా నిర్దారణ కావడంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటికే ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండగా, దీంతో ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాధితో చికిత్స పొందుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Next Story

Most Viewed