- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ MGMలో అద్దాలు ధ్వంసం
by Shyam |
<p>దిశ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలోని మహత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో కొవిడ్ వార్డులో పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆస్పత్రి సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కరోనా రోగులకు భోజనం, మంచి నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహించిన బంధువులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అంతకుముందు కొవిడ్ రోగులకు సరైన వైద్యం అందించడం లేదంటూ వైద్యులపై పలువురు చేయిచేసుకున్నారు. తాజా ఘటనలతో ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా, దీనిపై […]</p>

X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలోని మహత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో కొవిడ్ వార్డులో పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆస్పత్రి సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కరోనా రోగులకు భోజనం, మంచి నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహించిన బంధువులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు.
అంతకుముందు కొవిడ్ రోగులకు సరైన వైద్యం అందించడం లేదంటూ వైద్యులపై పలువురు చేయిచేసుకున్నారు. తాజా ఘటనలతో ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా, దీనిపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Next Story






