రాజమండ్రిలో కరోనా పేషంట్ సూసైడ్

by  |
రాజమండ్రిలో కరోనా పేషంట్ సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ఓ వైపు కొరలు చాస్తుంటే వ్యాధి సోకిన బాధితులు వైరస్‌తో పోరాడకుండా జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఇప్పటికే , కరోనా సోకిందన్న మనస్తాపంతో చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా బాధితుడు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్.. అదే ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజమండ్రికి చెందిన వాసిగా అధికారులు గుర్తించారు.

Next Story

Most Viewed