మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి

by  |
మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి మిమ్స్‌లో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఆస్పత్రిలోని మంచం మీద నుంచి జారిపడి మృతి చెందాడు. అయితే, అతడి మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది ఎవరు కూడా ముట్టుకోలేదు. అక్కడే మంచం కిందనే అలాగే వదిలేశారు. దీంతో మిగతా బాధితులు కూడా రాత్రంతా తీవ్ర ఆందోళన చెందారు. విషయం వెలుగులోకి రావడంతో విమ్స్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story