ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా పేషెంట్ ఆత్మహత్య

by  |
ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా పేషెంట్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో ఉరి వేసుకుని కరోనా బాధితుడు మృతిచెందిన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ వ్యక్తి కరోనా సోకింది. దీంతో అతను మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రిలో విషాదం నెలకొన్నది. మిగతా బాధితులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం.


Next Story