దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే?

by  |
corona, india
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ నెలలో గత రెండు రోజులతో పోలిస్తే సోమవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,68,147 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కు చేరుకుంది. కాగా గత రెండు రోజులతో పోలిస్తే మరణాల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. తాజాగా కరోనా బారిన పడి దేశంలో 3,417 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,18,959కు చేరింది. వీటిలో మహారాష్ట్ర(700), ఢిల్లీ(400), యూపీ(300) ఉన్నాయి. తాజాగా 34,13,642 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 3,00,732 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారీ సంఖ్య 16,29, 3003గా ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed