కొమురం భీం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్

by  |
కొమురం భీం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
X

దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తున్నది. రోజూ వందల సంఖ్యంలో కేసులు నమోదు అవుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జైనూర్ మండలం ఒడ్డెరగూడెంకు చెందిన ఓ మహిళకు, పురుషుడికి సోకినట్టు వైద్యులు నిర్దారించారు. వీరిద్దరూ ఇటీవలే ముంబయి నుంచి గ్రామానికి రాగా.. వారిని ఆసిఫాబాద్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఇరువురి రక్త నమూనాలను ఆదిలాబాద్‌కు రిమ్స్ పంపగా బుధవారం ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి బాలు ప్రకటించారు. దీంతో జిల్లాలో మళ్లీ కరోనా ఆందోళన మొదలైంది

Next Story