కరోనా సోకిందని వ్యక్తి ఏంచేశాడో తెలుస్తే షాక్ అవుతారు..

by  |
కరోనా సోకిందని వ్యక్తి ఏంచేశాడో తెలుస్తే షాక్ అవుతారు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా వైరస్ సోకిందని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం అర్ధరాత్రి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం గుడ్డి ముల్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉల్లి గుండం నరసప్ప(48) కు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మనోవేదనకు గురైన నర్సప్ప శనివారం అర్థరాత్రి దాటిన తరువాత తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు పీ.పీ.కిట్ లు సమకూర్చడంతో నర్సప్ప కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ వ్యవసాయ పొలం వద్దకు తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Next Story

Most Viewed