భారత్‌లో ఇవాళ కరోనా కేసులెన్నంటే!

by  |
భారత్‌లో ఇవాళ కరోనా కేసులెన్నంటే!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,638 కొత్త కేసులు నమోదవ్వగా.. 670 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84,11,724కు చేరుకోగా, వైరస్ సోకి ఇప్పటివరకు 1,24,985 మరణాలు సంభవించాయి.

ఇదిలాఉండగా, దేశంలో కరోనా పూర్తిగా నిర్మూలించబడలేదని, వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సీసీఎంబీ డైరక్టర్ రాకేశ్ శర్మ సూచించారు. పండుగల సమయంలో ఎక్కువగా ప్రజలు గుమ్మిగూడొద్దని, మనిషి నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రజానీకాన్ని హెచ్చరించారు.

Next Story