తెలంగాణలో కొత్తగా 921కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 921కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 921 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. తాజా కేసులు కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,65,049కు చేరాయి.

ప్రస్తుతం 11,047 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 2,52,565 మంది కరోనా నుంచి క్షేమంగా కోలుకున్నారు. తాజా మరణాలు కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో 1,437 మంది కరోనాతో మరణించారు. అంతేకాకుండా 8,720 మంది ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


Next Story

Most Viewed