- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను జూన్ 30 వరకు పొడిగించింది. దేశంలో రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మహమ్మారి తిరిగి పుంజుకోకుండా రాష్ట్రాల్లో కరోనా కఠిన నిబంధనలు మాత్రం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక పరిస్థితి, అవసరాలు, వనరులకు అనుగుణంగా తమ రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహమ్మారిని పూర్తిగా అధిగమించే విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలను చైతన్య పరుస్తూ క్షేత్రస్థాయి అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని వెల్లడించింది.
Next Story