తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా.. 36కు పెరిగిన కేసులు

by Shyam |   (  Updated:2020-03-24 03:40:31  IST  )

<p>తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36కు చేరుకుంది. కొత్తగా కరోనా వైరస్ సోకిన ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏండ్ల వ్యక్తి లండన్‌ నుంచి వచ్చారు. చందానగర్‌కు 39 ఏండ్ల మహిళ జర్మనీ నుంచి, బేగంపేటకు చెందిన 61 ఏండ్ల మహిళ సౌదీ అరేబియా నుంచి [&hellip;]</p>

తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా.. 36కు పెరిగిన కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36కు చేరుకుంది. కొత్తగా కరోనా వైరస్ సోకిన ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏండ్ల వ్యక్తి లండన్‌ నుంచి వచ్చారు. చందానగర్‌కు 39 ఏండ్ల మహిళ జర్మనీ నుంచి, బేగంపేటకు చెందిన 61 ఏండ్ల మహిళ సౌదీ అరేబియా నుంచి రాగా వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Tags: corona virus out break, tuesday 3 new cases reported in telangana, total cases 36

Next Story