రాజమహేంద్రవరం జైలులో 8 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా

by  |
Corona virus
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజుల నుండి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మరింత మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed