ఏయూలో కరోనా కలకలం.. విద్యార్థుల్లో ఆందోళన

by  |
corona
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో కరోనా కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ కాలేజీలో 53 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన 53 మంది విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నిలిపివేయాలని కోరారు. పరీక్షలు నిలిపివేయకపోతే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని విద్యార్థులు చెప్తున్నారు.

Next Story